Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పీఓకేలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అక్కడ నిరసనలు తెలుపుతున్న పౌరులపై పాకిస్థాన్ బలగాలు జరిపిన దమనకాండలో గత రెండు రోజుల్లో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో తీవ్ర అశాంతి నెలకొన్న నేపథ్యంలో పాక్ సైన్యం విచక్షణారహితంగా వ్యవహరిస్తోందని స్థానిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

‘యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ’ (యూకేపీఎన్‌పీ) ఈ ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల‌ 27, 28 తేదీల్లో రావల్‌కోట్, మీర్పూర్ సహా పలు ప్రాంతాల్లో పాక్ బలగాలు జరిపిన దాడుల్లో 40 మంది పౌరులు మరణించారని, వందలాది మందిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించింది. అంతేకాకుండా జూన్ 5 నుంచి ఇప్పటివరకు 100 మందికి పైగా పౌరులను పాక్ సైన్యం చంపేసిందని, వందల మందిని బలవంతంగా అదృశ్యం చేసిందని పేర్కొంది.

ఇదిలా ఉండగా, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేత సర్దార్ అమ్మాన్ ఖాన్ కూడా పాక్ సైన్యంపై విరుచుకుపడ్డారు. ఇది నిరాయుధులైన పౌరులపై జరిగిన ‘మారణకాండ’ అని ఆయన అభివర్ణించారు. “కేవలం రెండు రోజుల్లోనే పాక్ బలగాలు 38 మంది శాంతియుత నిరసనకారులను అత్యంత కిరాతకంగా చంపేశాయి” అని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -