- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నరెందర్ ప్రజలకు సూచించారు. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందనీ, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని చెప్పారు. నీటి మట్టం పెరిగే ప్రాంతాలకు వెళ్ళవద్దని, విద్యుత్ వైర్లు, స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. పిల్లలు, వృద్దులు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
- Advertisement -



