- Advertisement -
బ్రతకడమే యుద్దమైన చోట
మళ్లీ మళ్లీ వాళ్లు యుద్ధాన్ని ప్రకటిస్తారు
ఈ దేశ పౌరులమైన మేము – మా దేశం పట్లా …!
అని ప్రతిజ్ఞ ముగియకుండానే, వాళ్లంతా
అభియోగం మోపబడి శిక్షించబడ్డ ఖైదీలా
ఓ సరళరేఖ మీద నిలబడి దురాక్రమణ సెగల్లో కాలిపోతారు
మిగిలిన వాళ్లంతా
రాలిపోయిన వాళ్ళ బూడిదను కుప్పలుగా పోసి రోధిస్తారు
తెల్లారాక యుద్ధంలో వీరమరణం అనే ప్రకటన
ఏ చితికిన బతుకుల్ని అతికించగలదు
ఏ మెతుకుల్ని పండించగలదు
దేశాన్ని ప్రేమించడం అంటే
యుద్ధంలో మరణించడం అని తెలిసిపోయింది
దేశం కోసం యుద్ధాన్ని ప్రకటించిన వాడు మాత్రం
ఇంకా ఎందుకు మిగిలిపోయాడో నాకు అర్థం కాలేదు
పి.సుష్మ, 9959705519
- Advertisement -



