- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రికలో ఉత్తమ కథనాలు రాసిన జర్నలిస్టులకు శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే నవతెలంగాణ 11 వార్షికోత్సవ సభలో అవార్డులను అందజేయనున్నారు. 2025-26కు గానూ స్టేట్ బ్యూరో విభాగానికి ప్రథమ స్థానంలో అచ్చిన ప్రశాంత్, ద్వితీయ స్థానంలో బొల్లె జగదీశ్వర్ నిలిచారు. ప్రాంతీయ ప్రతినిధుల విభాగంలో ప్రథమ స్థానంలో ఎ.పరిపూర్ణం (మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి), ద్వితీయ స్థానంలో మీస మధు (నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి) ఉన్నారు. వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారు అవార్డులు అందుకోనున్నారు.
నేటి వార్షికోత్సవ సభ navatelanagna tv లో
LIVE
ఉదయం 11:00 గం.ల నుంచి…
- Advertisement -



