- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి 4 లక్షల 40 వేల 967 రూపాయల కానుకలు సమర్పించినట్లు ఆలయ ఈఓ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కమల, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు రామగిరి శర్మ, సిద్ధగిరి శర్మ, సిద్దేష్, రాజు పంతులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



