- Advertisement -
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల: తెలంగాణకు చెందిన ప్రముఖ సహకార రంగానికి పేరు తీసుకువచ్చిన కొండూరు రవీందర్ రావు నాబార్డ్ అనుబంధ సంస్థ బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, లక్నో పాలక మండలి సభ్యునిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. మొదటిసారిగా సిరిసిల్ల కు వచ్చిన ఆయనను సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, చక్రపాణి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, వైస్ చైర్మన్ దార్ల సందీప్, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, కౌన్సిలర్ సభ్యులు, సెస్ డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



