- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా-ఇరాన్ దౌత్య పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.43 డాలర్లకు, WTI క్రూడ్ ధర 75.91 డాలర్లకు చేరింది. దీనివల్ల భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు దిగుమతి వ్యయం తగ్గి ఊరట లభించనుంది. భవిష్యత్తులో భౌగోళిక పరిస్థితులు, సరఫరా ఆధారంగా ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
- Advertisement -



