- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల వినతులను ప్రజావాణి పోర్టల్ ద్వారా నమోదు చేసి, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించనున్నారు.
- Advertisement -


