నవతెలంగాణ – హైదరాబాద్ : బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం (ఆగస్టు 20) ఉదయం నాటికి పసిడి ధరల్లో స్వల్ప క్షీణత నమోదైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు ధరల మార్పునకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,960గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,040 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,16,220గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలోనూ స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై రూ.100 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రూ.2,49,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


