- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టులోకి 2.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులోని 33 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు.
- Advertisement -



