- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ రాజధాని పరిధిలోని 28 నియోజకవర్గాల్లో ప్రత్యేక సమగ్ర సర్వే ముగుస్తున్న నేపథ్యంలో దాదాపు 40 లక్షల ఓట్లు రద్దయ్యే అవకాశముంది. సనత్నగర్లో అత్యధికంగా 45.68% (1.16 లక్షలు) ఓట్లు రద్దు కానున్నాయి. రెండు చోట్ల ఓట్లు ఉండటం, సొంతూరి ఓటుకే ప్రాధాన్యమివ్వడం, ఎన్యూమరేషన్ ఫారాలు నింపకపోవడమే దీనికి ప్రధాన కారణాలు. ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఫారాలు ఇవ్వని వారు ఆన్లైన్లో నింపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు.
- Advertisement -



