- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బ్రెజిల్లోని రియో డి జెనీరో టిజుకా జాతీయ ఉద్యానవనంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొలంబియన్ మహిళా పర్యాటకులతో పాటు పైలట్ మరణించారు. బాలిక 15వ పుట్టినరోజు వేడుకల కోసం వచ్చిన కుటుంబంలో ముగ్గురు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై బ్రెజిల్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
- Advertisement -



