Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలువరకట్న వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య

వరకట్న వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వరకట్న వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పల్లవి (20) ఘట్‌కేసర్‌ మండలం ఘనపూర్‌లోని కేపీఆర్‌ఐటీ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది.

ఈ ఏడాది ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డితో పల్లవికి వివాహం జరిగింది. వివాహమైన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన పల్లవి తాను చదువుతున్న కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై మృతురాలి తల్లి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -