నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. వాతావరణ మార్పుల వల్ల ఆమె పొట్ట, మూత్రనాళ ఇన్ఫెక్షన్కు గురవ్వడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. తన ఆరోగ్యం మెరుపడిన తర్వాత మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె తదుపరి చికిత్స ఇంటివద్దే కొనసాగుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
మార్చి 24న చికిత్స కోసం సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు డాక్టర్ డి.ఎస్.రాణా, డాక్టర్ ఎస్. నంది, డాక్టర్ అరూప్ బసుల బృందం పర్యవేక్షణలో చికిత్సనందించడం జరిగింది. ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఆమెకు యాంటీబయోటిక్స్ అందించాము. చికిత్సకు స్పందించి ఆమె కోలుకున్నారు. మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆమె తదుపరి చికిత్స ఇంటివద్దే కొనసాగుతుంది అని ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజరు స్వరూప్ వెల్లడించారు.



