Sunday, June 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకామారెడ్డిలో తహసీల్దార్ల బదిలీలు ..

కామారెడ్డిలో తహసీల్దార్ల బదిలీలు ..

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో భారీగా రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సదాశివనగర్  తహశీల్దార్ గంగాసాగర్ ను బీబీపేటకు బదిలీ చేయగా అక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ సత్యనారాయణ ను సదాశివనగర్​కు బదిలీ అయ్యారు. తాడ్వాయి తహశీల్దార్​గా మాచారెడ్డిలో తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న శ్వేతను భిక్కనూరు కు, బిక్నూర్  తహశీల్దార్ శివప్రసాద్ ను ఆర్డీవో కామారెడ్డి కార్యాలయం డీఏవోగా బదిలీ అయ్యారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయ డీఏవో సునీత భిక్కనూరు తహశీల్దార్​గా  బదిలీ​ అయ్యారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్​​ సరళను మాచారెడ్డి తహశీల్దార్​గా బదిలీ చేశారు. నస్రుల్లాబాద్  తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ డొంగ్లీకి, బాన్సువాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ డీఏవో సువర్ణ నస్రుల్లాబాద్​ తహశీల్దార్​గా నియమితులయ్యారు. డొంగ్లీ తహశీల్దార్ అనిల్ కుమార్​ను బాన్సువాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ డీఏవోగా నియమించగా కలెక్టరేట్ సూపరింటెండెంట్​ సుధాకర్​ను దోమకొండ తహశీల్దార్​గా నియమించారు. ఆర్డీవో కార్యాలయ నాయబ్ తహశీల్దార్ లక్ష్మణ్​ను గాంధారి తహశీల్దార్​ కార్యాలయానికి, కామారెడ్డి డీసీఎస్​వో కిష్టయ్యను రామారెడ్డి తహశీల్దార్ కార్యాలయానికి డిప్యుటేషన్​పై పంపిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -