- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబై భూలేశ్వర్లోని జయ అంబే చౌక్ వద్ద శనివారం రాత్రి గణపతి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విగ్రహం కూలిపోవడంతో సంకేత్ నేవ్షే (33), బ్రిజేష్ హేమంత్ జోషి (30) అనే వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే బిఎమ్సి, పోలీసులు, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



