- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు రక్షాబంధన్ ప్రతీక అని ఆయన కొనియాడారు. మానవ సంబంధాలలో సోదరత్వమే గొప్పదని, భారతీయ కుటుంబ వ్యవస్థలో రాఖీ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలంతా ఒకరికొకరు తోడుగా, సోదరభావంతో మెలగాలని, అప్పుడే భారతీయ సంస్కృతి ప్రతిపాదించిన ‘వసుదైక కుటుంబం’ భావన పరిఢవిల్లుతుందని ఆయన ప్రకటన విడుదల చేశారు.
- Advertisement -



