- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, మంచిర్యాల, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అధికారులు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Advertisement -



