- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ నటుడు, చిరంజీవి మిత్రుడు జీవీ నారాయణరావు అనారోగ్యంతో మరణించారు. ఆయన భౌతికకాయానికి చిరంజీవి నివాళులర్పించి, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 1977 నుంచి పరిచయం ఉందని, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్గా ఉన్న జీవీ సరదాగా ఉండేవారని, ఆయన మరణ వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -



