- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖిత హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన అర్జున్ శర్మను ఆగ్రాలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్కి చెందిన నిఖిత గొడిశాల(27) ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లారు. ఈ ఏడాది జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అమెరికాలోని పోలీసులకు కంప్లైంట్ చేసి తిరిగి ఇండియాకు వచ్చేశాడు. జనవరి 3న అతని అపార్టుమెంట్లోని ఫ్లాట్ను పోలీసులు పరిశీలించగా నిఖిత మృతదేహం కనిపించింది.
- Advertisement -


