- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్లో సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య 626కి చేరుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య రెండు వేలు దాటింది. టిబెట్లో ఏర్పడిన తాత్కాలిక సరస్సులో నీటి మట్టం పెరగడంతో చైనా ఆందోళన వ్యక్తం చేసింది. రెండోసారి భారీ బురద వరదలు వచ్చే అవకాశం ఉందని, నేపాల్, టిబెట్ బోర్డర్లోని గిరాంగ్ పోర్టు వద్ద రెస్క్యూ బృందం సరస్సుపై నిఘా పెట్టింది. చైనా మీడియా ప్రకారం, టిబెట్లో ఏడుగురు మరణించగా, 554 మంది గల్లంతయ్యారు.
- Advertisement -



