- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మా ఆస్తులు తీసుకొని రూ.వెయ్యి కోట్లు ఇస్తే చాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ వెయ్యి ఎకరాలు దోచుకున్నారని రేవంత్రెడ్డి అసత్య ప్రచారం చేశారు. ఇటీవల అసెంబ్లీలో 67 ఎకరాలే ఉన్నాయన్నారు. రూ.వెయ్యి కోట్లు ఇస్తే మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. మిగిలిన 99వేల కోట్లతో పథకాలు అమలుచేయండి’ అని కేటీఆర్ అన్నారు.
- Advertisement -


