Friday, September 18, 2026
E-PAPER
Homeజాతీయంహ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసులో 9 మందికి జీవిత ఖైదు

హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసులో 9 మందికి జీవిత ఖైదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : 2019లో బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను అక్రమంగా భారత్‌కు తరలించిన కేసులో 9 మంది నిందితులకు హైదరాబాద్‌ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధించింది. వీరిలో 8 మంది బంగ్లాదేశ్‌ జాతీయులు ఉన్నారు. మహిళలకు ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించిన నిందితులు వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. దీనిపై 2019లో పోలీసులు కేసు నమోదు చేయగా ఏన్ఐఏ అధికారులు రీ-రిజిస్టర్‌ చేశారు. A1 నుంచి A12 వరకు మొత్తం 12 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -