- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ ప్రధాన ప్రతినిధి బృందానికి, సిబ్బందికి వీసాలను ఆమోదించినట్లు అమెరికా విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ, వచ్చేవారం న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ట్రంప్ ప్రభుత్వం వీసాలను ఆమోదించింది. వీసా గోప్యతా చట్టాల వల్ల పేర్లు వెల్లడించని అమెరికా అధికారుల ప్రకారం.. ఈ ప్రధాన ప్రతినిధి బృందంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఉన్నారు.
- Advertisement -


