- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సోమవారం మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని గంటవానిపల్లెకు చేరుకొన్న చంద్రబాబుకు ముందుగా స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం పూజలు చేసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. తరువాత వెలిగొండ ప్రాజెక్టు-1ను ప్రారంభించిన చంద్రబాబు ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి నీటిని నల్లమల సాగర్కు విడుదల చేశారు.
- Advertisement -



