Tuesday, April 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలురూ.5 బిక్షం వేశాడనే కోపంతో వ్యాపారిపై కత్తితో దాడి

రూ.5 బిక్షం వేశాడనే కోపంతో వ్యాపారిపై కత్తితో దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మానవత్వం చూపిన వ్యాపారిపైనే ఓ యాచకుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రూ.5 భిక్షం వేశాడనే కోపంతో వ్యాపారి శ్రీనివాస్‌పై ఓ యాచకుడు హత్యాయత్నానికి ప్రయత్నించాడు. శ్రీనివాస్ ఇచ్చిన చిల్లర తక్కువగా ఉందని గొడవపడి, కత్తితో దాడికి యత్నించగా.. బాధితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యాచకుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -