Thursday, April 16, 2026
E-PAPER
Homeనిజామాబాద్విలేకరికి పంచాయతీ కార్యదర్శి బెదిరింపులు

విలేకరికి పంచాయతీ కార్యదర్శి బెదిరింపులు

- Advertisement -
  • ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన విలేఖరి

నవతెలంగాణ-గాంధారి: గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామ‌స్తులు పంచాయతీ కార్యదర్శిపై బుధవారం ఎంపీడీవో రాజేశ్వరకు ఫిర్యాదు చేశారు. స‌మ‌య‌పాల‌న పాటించ‌డంలేద‌ని, విధుల్లో బాధ్య‌త‌ర‌హితం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వార్త‌ను రాసిన విలేఖ‌రికి ఫోన్ చేసిన స‌దురు కార్య‌ద‌ర్శి బెదిరింపుల‌కు దిగార‌ని, త‌న ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని బాధిత‌ విలేకరి ఎంపీడీవో రాజేశ్వర్ కు ఫిర్యాదు చేశారు. తిమ్మాపూర్ పంచాయతీ కార్యదర్శి పై చర్య తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండలం చెందిన జర్నలిస్టు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -