- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా ఇంధనాల రేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు 100 డాలర్లకు, ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర 109 డాలర్లకు చేరింది. ఇరాన్– అమెరికా మధ్య ఉద్రిక్తతలు, సరఫరాలో అంతరాయం దీనికి కారణాలు. ఈ మేరకు నష్టాల బాటపట్టిన ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలు ఆదాయాన్ని పెంచుకునేందుకు మరోమారు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి.
- Advertisement -



