- Advertisement -
•సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నవతెలంగాణ-మర్రిగూడ
భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ నేటి ప్రజానీకానికి స్ఫూర్తి అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా గురువారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల పార్టీ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు సల్వుజు రామలింగా చారి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



