- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేటీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ది అండర్ 18 వరల్డ్’ పాడ్కాస్ట్లో భాగంగా కేటీఆర్ ప్రభాస్కు ఫోన్ చేయగా, ఓ చిన్నారి ఫోన్ తీసుకుని ‘ఈ ఫోన్ నాకు రోడ్డుపై దొరికింది.. ఎవరు మాట్లాడుతున్నారు?’ అంటూ ప్రాంక్ చేసింది. దీంతో ప్రభాస్ వెంటనే కాల్ కట్ చేశారు. దీంతో కేటీఆర్, పిల్లలు నవ్వుకున్నారు. అనంతరం కేటీఆర్ మళ్లీ ప్రభాస్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించడంతో ప్రభాస్ కూడా నవ్వుతూ స్పందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Advertisement -



