- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ ఏడాదిలో రాష్ట్రానికి 65 జీసీసీలు తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ జీసీసీలు 85 శాతం రెంటల్స్పేస్తో నిండిపోయాయని, వీటి రాకతో మరో రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. కొత్త జీసీసీ పాలసీ తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు రూ.70వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, అయితే డేటా సెంటర్ల ఏర్పాటుతో ఎన్ని లాభాలున్నాయో.. అన్ని అనర్థాలు ఉన్నాయని సభ్యులకు వివరించారు.
- Advertisement -



