- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా బ్యాంకులు శుక్రవారం మూతబడనున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. రేపు రెండో శనివారం, ఆదివారం సెలవులు, సోమవారం వినాయక చవితి కావడంతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. ఐదు రోజుల పని దినాలు, పెన్షన్ సమస్యల పరిష్కారం కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.
- Advertisement -



