- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యూపీ ఘాజియాబాద్ పోలీస్ చౌకీ ఎదుటే ఓ యువకుడు నిప్పంటించుకున్నాడు. ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ గార్డెన్ చౌకీ వద్ద ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. పోలీసులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తుండగా, హఠాత్తుగా బయటకు వచ్చిన మోనూ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో షాక్కు గురయ్యారు.
- Advertisement -



