- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏఎంఆర్ గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోల్కతాకు సంబంధించిన ఓ కేసులో హైదరాబాద్, దిల్లీ, జార్ఖండ్, కోల్కతాలో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. కోల్కతా నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు స్థానిక అధికారులతో కలిసి హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఏఎంఆర్ కార్యాలయంలో సోదాలు చేపట్టాయి. ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల మళ్లింపుపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
- Advertisement -



