- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: డ. ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్ల కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2.90 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 15తో ముగియనుంది. మొదటి విడతలో 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున 1.19 లక్షల మంది అర్హులైన బీసీ మహిళలకు రూ.12 వేల విలువైన కుట్టుమిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నారు. 18–55 ఏళ్ల వయసు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు.
- Advertisement -


