- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్ అధ్యక్షతన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు శని, ఆదివారాల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు ఎల్-సిసి సహా పలువురు నేతలు హాజరవుతున్నారు. గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాలు, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం, ఆహార-ఇంధన భద్రత, సాంకేతిక బదిలీపై భారత్ దృష్టి పెట్టనుంది.
- Advertisement -



