- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లోని శంషాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న కంటైనర్.. డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పలు వాహనాలు, బైకును ఢీకొంటూ ఓ హోటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దుకాణం వద్ద టీ తాగేందుకు వచ్చిన అజ్మల్ అనే వ్యక్తిని బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరిన అజ్మల్.. మార్గంమధ్యలో టీ తాగేందుకు ఆగగా ఘటన చోటుచేసుకుంది.
- Advertisement -



