- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎస్కే జట్టుకు వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. యువ పేసర్ ముఖేష్ చౌదరి తన తల్లి ప్రేమ్ దేవిని కోల్పోవడంతో జట్టులో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి మంగళవారం రాత్రి కన్నుమూశారు. ముఖేష్ తన స్వగ్రామం రాజస్థాన్లోని భిల్వారాకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్తో జరగనున్న తదుపరి మ్యాచ్కు అతను దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జట్టులో గాయాలు, ఫామ్ లోపం వంటి సమస్యలున్నాయి. ముఖేష్ గైర్హాజరీలో CSKకు కొత్త బంతి బౌలింగ్లో లోటు ఏర్పడనుంది.
- Advertisement -



