- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు ఆర్పి.. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
- Advertisement -



