- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కొట్టాల గ్రామంలో శనివారం మహిళా సమైక్య భవనం ఏర్పాటుకు మర్రిగూడ తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు స్థల పరిశీలన చేశారు. ఆ స్థలాన్ని గ్రామ సర్పంచ్ కల్లెట్ల లింగయ్య స్వాధీనపరిచి, మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి పనులను వెంటనే ప్రారంభించాలని పిఆర్ఏఈకి, సంబంధిత అధికారులకు తాహసిల్దార్ ఆదేశాలు జారి చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



