Saturday, June 7, 2025
E-PAPER
Homeఆటలుజెమీ ఓవర్టన్‌కు పిలుపు

జెమీ ఓవర్టన్‌కు పిలుపు

- Advertisement -

– భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు
లండన్‌ (ఇంగ్లాండ్‌):
ఈ నెల 20న షురూ కానున్న భారత్‌తో తొలి టెస్టుకు ఆతిథ్య ఇంగ్లాండ్‌ 14 మందితో కూడిన జట్టును ఎంచుకుంది. ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకున్న సెలక్టర్లు.. జెమీ ఓవర్టన్‌ను ఎంపిక చేశారు. ఒక్క టెస్టులోనే ఆడిన ఓవర్టన్‌ 2 వికెట్లు సహా 97 పరుగులు చేశాడు. గస్‌ అటిక్సన్‌ తొడ కండరాల గాయంతో బాధపడుతుండగా అతడి స్థానంలో ఓవర్టన్‌ జట్టులోకి వచ్చాడు. జాకబ్‌ బెతెల్‌, క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్సెలు సైతం జట్టులోకి రాగా.. బెన్‌ స్టోక్స్‌ సారథ్యం వహించనున్నాడు. జో రూట్‌, హ్యారీ బ్రూక్‌ సహా స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ జట్టులో నిలిచారు.
తొలి టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు : బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), బెన్‌ డకెట్‌, జాక్‌ క్రావ్లీ, ఒలీ పోప్‌, జాకబ్‌ బెతెల్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, జెమీ స్మిత్‌, జెమీ ఓవర్టన్‌, క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్సె, జోశ్‌ టాంగ్‌, శామ్‌ కుక్‌, షోయబ్‌ బషీర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -