- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో తిరుప్పూర్ జిల్లా ఉడుమలైకు చెందిన వివేకానంద విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ కామాక్షి దేవి(28) మృతి చెందారు. అవివాహిత అయిన ఆమె బెంగళూరు రామమూర్తినగర్లో ఉంటూ అమెజాన్ ఇండియా కంపెనీలో కూడా పని చేస్తున్నారు. క్రికెటర్లను చూసేందుకు వెళ్లిన ఆమె తొక్కిసలాటలో కిందపడిపోయి ప్రాణాలు విడిచారు. కామాక్షి దేవి మృతదేహన్ని గురువారం మధ్యాహ్నం ఉడుమలైకు తీసుకొచ్చారు.
- Advertisement -