- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం విడతలో 9 గంటల వరకు అభ్యర్థులను అనుమతించారు. 9.30 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉండనుంది. ఈ నెల 30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఏపీలో 137, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,305 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. మధ్యాహ్నం విడతలో 2 గంటలకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
- Advertisement -