Monday, June 9, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బోరున ఏడ్చిన మాజీ సీఎం కేసీఆర్‌ (వీడియో)

బోరున ఏడ్చిన మాజీ సీఎం కేసీఆర్‌ (వీడియో)

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాగంటి.. అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఏఐజీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ సమాచారం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా ఎర్రవెల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం మాదాపూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఉన్న మాగంటీ గోపినాథ్ మ‌ృతదేహానికి పూలమాలను వేసి నివాళులు ఆర్పించారు. ఈ సమయంలో తన పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన గోపినాథ్ భౌతిక కాయాన్ని చూసిన కేసీఆర్ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు.
అక్కడే ఉన్న మాగంటి కుమారుడిని దగ్గరకు తీసుకొని దైర్యం చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేసీఆర్.. వారికి దైర్యం చెప్పారు. అలాగే అన్ని సమయాల్లో బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ హామి ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -