నవతెలంగాణ – హైదరాబాద్ : టీమిండియా నుంచి చాలా కాలంగా దూరంగా ఉన్న పృథ్వీ షా టీ 20 ముంబై లీగ్లో తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. నార్తర్న్ ముంబై పాంథర్స్ తరపున ఆడుతూ ప్రత్యర్థి జట్టు ట్రయంఫ్ నైట్స్ బౌలింగ్ అటాక్ను పూర్తిగా ధ్వంసం చేశాడు. 220 స్ట్రైక్ రేట్తో ఆడుతూ కేవలం 34 బంతుల్లో 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పృథ్వీ షా కేవలం 23 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. అయితే నార్తర్న్ ముంబై కెప్టెన్ తన ఇన్నింగ్స్ను నెమ్మదిగా ప్రారంభించాడు. మొదటి 10 బంతుల్లో పృథ్వీ షా కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆ తర్వాత షా తన గేర్ మార్చి తరువాతి 13 బంతుల్లో 36 పరుగులు చేసి అర్థ సెంచరీ సాధించాడు.
క్రికెట్లో గత కొంతకాలంగా నిరాశపరుస్తున్న పృథ్వీ షా తన బ్యాటింగ్తో అదరగొట్టాడు. టీ20 ముంబై లీగ్లో ట్రయంఫ్ నైట్స్తో జరిగిన మ్యాచ్లో పృథ్వీ షా ఊచకోత కోశాడు. కేవలం 34 బంతుల్లో 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన ఈ ఇన్నింగ్స్లో షా 12 ఫోర్లు, మూడు సిక్సులు బాదాడు. 220 స్ట్రైక్ రేట్తో పనృథ్వీ షా ప్రత్యర్ధి జట్టు బౌలింగ్ అటాక్ను చిన్నాభిన్నం చేశాడు. అర్జున్ జైస్వాల్తో కలిసి రెండో వికెట్కు అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత పృథ్వీ షా.. హర్షల్ జాదవ్ తో కలిసి వేగంగా 30 పరుగులు జోడించాడు.