Tuesday, June 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేసీఆర్ తో హరీష్ రావు భేటీ

కేసీఆర్ తో హరీష్ రావు భేటీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం విచారణ ముగిసిన తర్వాత మాజీ మంత్రి  హరీష్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. కొద్దిసేపటిక్రితమే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న హరీష్ రావు..కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఈరోజు కమిషన్ ముందు విచారణకు హరీశ్ రావు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై హరీష్ రావును జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. దాదాపు 45 నిమిషాల పాటు హరీష్ రావును కమిషన్ విచారించింది. ఆ తర్వాత బయటకు వచ్చిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ఆధారాలను కమిషన్ కు సమర్పించానని తెలిపారు. అక్కడ నుంచి నేరుగా హరీషరావు.. కేసీఆర్ దగ్గరికి వెళ్లారు.  కాగా, ఈనెల 11న కెసిఆర్ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -