Sunday, June 15, 2025
E-PAPER
Homeరిపోర్టర్స్ డైరీబెదిరింపు కాల్స్‌

బెదిరింపు కాల్స్‌

- Advertisement -

మారిన పరిస్థితుల్లో టీవీ, సెల్‌ఫోన్‌ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. ప్రతి వ్యక్తికి చేతుల్లో ఫోన్లు దర్శనమిస్తున్నాయి.ఒంటికి బట్టలెలాగో చేతిలో సెల్‌ కూడా అంతే గ్యారంటీగా ఉంటున్నది. అయితే ఫోన్‌తో లాభ నష్టాలు కూడా ఉంటున్నాయి. పెరిగిన టెక్నాలజీతో అనేకమంది అడ్డదారులు తొక్కుతున్నారు. బెదిరించి డబ్బులు కాజేయడం, ఆస్తులు కొట్టేయడం వంటివి చేస్తున్నారు. ఇలా చేసినవారు అడ్డంగా దొరికిపోయి కటకటాల్లో ఊచలు లెక్కించడం కూడా చూస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటే డబ్బుల కోసం చేస్తారు. కానీ రాజకీయ నాయకులకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి, ఎందుకొస్తున్నాయి? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‘అప్పుడప్పుడు నాక్‌ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఎవరు కాల్స్‌ చేస్తున్నారో గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి’ అంటూ పోలీ సులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ తాజాగా ఆయనకు మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు చెబుతున్నారు. ఆయన పార్టీ బీజేపీకి దూరంగా ఉంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఆయన ఒంటికాలి మీద లేస్తారు. చాలాసార్లు ఓ మతాన్ని టార్గెట్‌ చేస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలో తన ప్రాణాలకు ట్రెట్‌ ఉందంటూ చెబుతుంటారు. ఆయనకు ఫోన్‌కాల్స్‌ వస్తూనే ఉంటాయి. పోలీసులకు ఆయన ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పటివరకు ఆయన్ను బెదిరించిన వ్యక్తి ఎవరో తెలియదు. సరే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు. మీ సొంతపార్టీ అయిన కూడా పట్టించుకోవట్లేదంటే ఏంటి అర్థం రాజాసింగ్‌ అన్న.
-గుడిగ రఘు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -