Monday, June 16, 2025
E-PAPER
Homeజాతీయంసోన్ ప్ర‌యోగ్‌లో విరిగిన కొండ‌చ‌రియ‌లు..ఒక‌రు మృతి

సోన్ ప్ర‌యోగ్‌లో విరిగిన కొండ‌చ‌రియ‌లు..ఒక‌రు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: చార్‌ధామ్ యాత్ర‌లో మ‌రో ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే మార్గంలో అక‌స్మాత్తుగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు చ‌నిపోగా..ఇద్ద‌రికి గాయాలైయ్యాయి. బాధితుల‌ను వెంట‌నే క్యాంప్ ఆస్ప‌త్రికి త‌ర‌లించింది విప‌త్తు ద‌ళం. ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణంలో మార్పులు చోటుచేసుకొని..భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో.. జంగల్‌చట్టి సమీపంలో ఆక‌స్మాత్తుగా శిథిలాలు, రాళ్లు లోయలో ప‌డ్డాయ‌ని అధికారులు చెప్పారు. భారీగా రాళ్లు ప‌డిపోవ‌డంతో న‌డ‌క‌దారి మూత‌ప‌డింద‌ని, యాత్రికుల భ‌ద్ర‌త దృష్ట్యా త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు సోన్ ప్ర‌యోగ్ వెళ్లే మార్గాన్ని మూసివేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేద‌న్నారు. ఆక‌స్మాత్తుగా వ‌చ్చే విప‌త్తుల‌కు చార్‌ధామ్ యాత్రికులు ఆందోళ‌న చెంద‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

ఇదిలావుండ‌గా..ఇవాళ ఉద‌యం గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌ కు వచ్చిన హెలికాప్టర్‌ తిరిగివెళ్తూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్‌ సహా హెలికాప్టర్‌లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ‌తంలో కూడా రెండు హెలికాప్ట‌ర్లు సాంకేతిక లోపం కార‌ణంగా క్రాస్ ల్యాండ్ అయ్యాయి. ఈ ప్ర‌మాదాల్లో ఎవ‌రికి ఎలాంటి ప్రాణ‌హాని జ‌ర‌గ‌పోవ‌డంతో అధికారులు ఊపిరి పిల్చుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రెండు రోజులపాటు చార్‌ధామ్‌ యాత్రకు హెలికాప్టర్‌ సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -