Thursday, June 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరైలు ట్రాక్‌పై బాంబు పేలుడు..పట్టాలు తప్పిన రైలు

రైలు ట్రాక్‌పై బాంబు పేలుడు..పట్టాలు తప్పిన రైలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రైలు మార్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై శక్తివంతమైన బాంబు పేలింది. ఈ ఘటనలో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు జకోబాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. దుండగులు రైలు మార్గంలో ఐఈడీని అమర్చడం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రాథమిక స‌మాచారం. పేలుడు తీవ్రతకు రైలు పట్టాలపై సుమారు మూడు అడుగుల లోతైన గొయ్యి ఏర్పడిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేదా గాయపడిన వారి వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -