– వాటితోనే కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు
– ప్రజలు, ప్రజాసంఘాల నేతల ఆగ్రహం
– ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
నవతెలంగాణ-అలంపూర్
మా ప్రాంతంలో కాలుష్యకారక ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేసిన రాజోలి రైతులకు పోలీసులు బేడీలు వేశారు. గతంలో లగచర్లలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఘటనలో అధికారు లపై దాడి చేశారంటూ అరెస్టు చేసిన రైతులకు బేడీలు వేసినట్టే.. రాజోలి రైతులకూ వేశారు. రిమాండ్లో ఉన్న రైతులకు బెయిల్ మంజూరు కాగా, బుధవారం బేడీలు వేసి కోర్టుకు తీసుకొచ్చారు. గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఘటనలో 40 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో 12 మంది రైతులకు రిమాండ్ విధించారు. వారికి బెయిల్ మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా బుధవారం మహబూబ్నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు చేతులకు బేడీలతో తీసుకొ చ్చారు. నేరస్థుల మాదిరిగా అన్నదాతలకు సంకెళ్లు వేయ డంపై ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడంపై ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్ఎస్ఐ, ఇద్దరు ఏఆర్ఎస్ఐలను సస్పెం డ్ చేస్తూ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్ద ధన్వాడ రైతులకు బేడీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES